తారక్ షోకి గెస్ట్ గా సమంత!
on Oct 8, 2021
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న 'ఎవరు మీలో కోటీశ్వరులు' షో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. సామాన్యుల కోసం డిజైన్ చేసిన ఈ షోలో అప్పుడప్పుడు సెలబ్రిటీలు కూడా సందడి చేస్తున్నారు. త్వరలో ఈ షోలో సమంత సందడి చేయనుందని తెలుస్తోంది.
ఎవరు మీలో కోటీశ్వరులు షోలో ఇప్పటికే రామ్ చరణ్, రాజమౌళి, కొరటాల శివ వంటి సెలబ్రిటీలు పాల్గొన్నారు. మహేష్ బాబు కూడా ఈ షోలో పాల్గొన్నారని.. త్వరలోనే ఆ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు సమంత వంతు వచ్చింది. సమంత తన మేనేజర్ మహేంద్రతో కలిసి ఈ షోలో అందుకున్న చెక్ ను చూపిస్తూ ఓ ఫోటో దిగింది. ఇప్పుడు ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో సమంత తారక్ షోలో పాల్గొన్నదని.. ఇప్పటికే ఎపిసోడ్ షూటింగ్ కూడా అయిపోయిందని అర్థమవుతోంది.
'ఎవరు మీలో కోటీశ్వరులు' లో సమంత పాల్గొన్నదన్న న్యూస్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవలే సమంత తన భర్త నాగ చైతన్యతో విడిపోతునట్లు ప్రకటించింది. విడాకుల ప్రకటన తర్వాత సమంత పాల్గొంటున్న ఫస్ట్ షో కావున.. మునుపటిలా సమంత యాక్టివ్ మాట్లాడుతుందా లేదా చూడాలన్న ఆసక్తి నెలకొంది. మరోవైపు ఎన్టీఆర్, సమంత కలిసి నాలుగు సినిమాల్లో కలిసి నటించారు. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. మరి షోలో సమంత వ్యక్తిగత విషయాల గురించి ఎన్టీఆర్ ఏమైనా అడుగుతారా? ఒకవేళ అడిగితే సమంత ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
Also Read